శ్రీరామ సేవే పరమావధిగా ప్రతి నిత్యం రామ నామ స్మరణలో ముంచడమే సంకల్పంగా ముందుకెళుతున్న శ్రీరామ సేవ సమితి ద్వారా గత 4 సంవత్సరాల నుంచి గోటి తలంబ్రాలు ఒలవడం జరుగుతుంది.
ఈసారి కూడా సూరారం నుంచి బాలనగర్ వరకు, సుచిత్ర నుంచి గాజుల రామారం వరకు మరియు కూకట్ పల్లి, మదీనా గూడ, బాచుపల్లి, లంగర్ హౌస్, అత్తాపూర్, ఎల్ బి నగర్ మొదలగు ప్రాంతంలో శ్రీరామ సేవ సమితి సభ్యులు గోటి తలంబ్రాలు ఒలవడము జరుగుతుంది.
భక్తులు ఒకచోటకు చేరి రామ నామ స్మరణ చేసుకుంటూ గోటి తలంబ్రాలు ఒలవడము జరుగుతుంది. ఈ ఓలిచిన తలంబ్రాలు వివిధ దేవాలయాలకు మొత్తం 11 దేవాలయాలకు శ్రీరామ సేవ సమితి అందజేస్తుంది.
ఈ కార్యక్రమములో భాగస్వాములు కాదలచిన వారు ఇక్కడ ఇచ్చిన నంబర్ ను సంప్రదించవచ్చని శ్రీరామ సేవ సమితి ప్రముఖ్ తెలపడమైనది.
WhatsApp : తుంగా శ్రీ : 6301767565